instruction
stringlengths
0
12.1k
input
stringlengths
0
22.2k
output
stringlengths
1
23.8k
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి సిలికాజెల్ సమక్షంలో తేమతో కూడిన గాలి, తడి లేకుండా మారుతుంది. దీనికి కారణం ఏమిటి?
సిలికాజెల్ సమక్షంలో తేమతో కూడిన గాలి, తడి లేకుండా మారుతుంది. దీనికి కారణం నీటి అణువులు జెల్ యొక్క ఉపరితలంపై అధిశోషణం చెందుతాయి.
“తీగచుట్టల అభివాహ మార్పు వ్యతిరేక దిశలో ప్రేరణ విద్యుత్ ప్రవాహం ఉంటుంది.” దీనినే …. అంటాం. A) VSEPR సిద్ధాంతం B) లెంజ్ నియమం C) ఫారడే నియమం D) ఓమ్ నియమం
B) లెంజ్ నియమం
హిమాలయ నదులు మూడు ముఖ్యమైన వ్యవస్థల కిందకు వస్తాయి. I. సింధూ నదీ వ్యవస్థ II. గంగానదీ వ్యవస్థ III. ? ప్ర. మూడవ వ్యవస్థ పేరు రాయండి.
బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ
ఒక వ్యాపార సంస్థకు అవసరమైన వివిధ రకాల మూలధనాన్ని పేర్కొనండి.
వ్యాపార సంస్థ ప్రారంభించడానికి విత్తము అవసరమవుతుంది. దీనినే మూలధనం అంటారు. మూలధనము ఎంత అవసరము అవుతుంది అనేది వ్యాపార సంస్థ యొక్క స్వభావము, పరిమాణాన్ని బట్టి ఉంటుంది. మూలధనమును రెండు రకాలుగా విభజించవచ్చును. అవి: 1. స్థిర మూలధనము 2. నిర్వహణ మూలధనము. 1) స్థిర మూలధనము: ఒక వ్యాపార సంస్థ స్థాపనకు ‘స్థలము, భవనాలు, యంత్రాలు, ప్లాంటు మొదలైన స్థిరాస్తులను సేకరించడానికి ఉపయోగించే మూలధనమును స్థిర మూలధనము అంటారు. ఇలాంటి మూలధనము లేకుండా సంస్థ వ్యాపారాన్ని నిర్వహించలేదు. వ్యాపార సంస్థ తన దీర్ఘకాలిక అవసరాలకు సేకరించే మూలధనమే స్థిర మూలధనము. స్థిర మూలధన పరిమాణము వ్యాపార సంస్థ స్వభావము, కార్యకలాపాలు, ఉత్పత్తి విధానము మొదలైన వాటిమీద ఆధారపడి ఉంటుంది. భారీ పరిశ్రమలకు స్థిర మూలధనము పెద్ద మొత్తములోను, వ్యాపారము చేసే దుస్తుల పంపిణీ సంస్థలో తక్కువ మొత్తములో అవసరము ఉంటుంది. 2) నిర్వహణ మూలధనము: ఒక వ్యాపార సంస్థ తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి అంటే ముడిపదార్థాల కొనుగోలు, వేతనాల చెల్లింపు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు, స్వల్పకాలిక పెట్టుబడులు, ఋణగ్రస్తులు, సరుకు నిల్వ, వసూలు బిల్లుల వంటి స్వల్పకాలిక ఆస్తులలో పెట్టుబడి పెట్టిన మూలధనాన్ని నిర్వహణ మూలధనము అంటారు. ప్రస్తుత ఆస్తులలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని సంవత్సరములోపు నగదు రూపములో తిరిగి పొందే అవకాశమున్నది. ఈ నిర్వహణ మూలధన పరిమాణము అన్ని వ్యాపార సంస్థలకు ఒకే మాదిరిగా ఉండదు. ఆయా సంస్థల అమ్మకాల టర్నోవర్, నగదు అమ్మకాలు, అమ్మకాల పరిమాణము వంటి అంశాలనాధారముగా ఎక్కువ లేదా తక్కువ నిర్వహణ మూలధనం అవసరమవుతుంది.
మొక్కలు నాటితే పర్యావరణానికి మేలు చేస్తాయి – ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం? A) చేదర్థక వాక్యం B) అష్యక వాక్యం C) ప్రార్థనాద్యర్థక వాక్యం D) సంయుక్త వాక్యం
A) చేదర్థక వాక్యం
ఇచ్చిన పదానికి నానార్ధాలు ఇవ్వండి: ఉక్తి
సరస్వతి, మాట
హరిశ్చంద్రుని గొప్పదనం గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
హరిశ్చంద్రుడు అయోధ్య రాజధానిగా పాలించిన సూర్యవంశ చక్రవర్తి. సూర్యవంశానికి గొప్ప పేరు ప్రతిష్ఠలు తెచ్చి పెట్టినవాడు. గొప్పదాత. వివేకమే సంపదగా కలవాడు. మంచి కీర్తి వైభవాలు కలవాడు. ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. సముద్రమంత దయగలవాడు. సర్వశాస్త్రాలు తెలిసినవాడు. సత్యవాక్పరిపాలకుడు. ఆడినమాట తప్పనివాడు. వశిష్ఠుడు చెప్పినట్లు బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతము కుంగిపోయినా, ఆకాశం ఊడి కింద పడినా, సముద్రం ఎండినా, భూగోళం తలకిందులయినా హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు.
క్రింది వానిలో కరణీయ సంఖ్య కానిది ఏది ? (A) √2 (B) √3 (C) √4 (D) √5
(C) √4
కింది వాక్యాన్ని ఏ రీతి వాక్యం అని గుర్తించి రాయండి. వారు వెళ్ళవచ్చా?
సందేహార్థక వాక్యం.
క్లోమ గ్రంథి విడుదల చేసే హార్మోన్ A) వ్యాసోప్రెస్సిన్ B) అడ్రినలిన్ C) ఇన్సులిన్ D) ప్రొజెస్టిరాన్
C) ఇన్సులిన్
ఇచ్చిన పదానికి పర్యాయ పదాలని ఇవ్వండి: పువ్వు
పుష్పము, ప్రసూనము, కుసుమము, విరి, సుమము
కుటుంబంలో ‘మన’ అనే భావన లేకపోతే ఎలా ఉంటుంది?
కుటుంబంలో ‘మన’ అనే భావన కుటుంబ సభ్యులందరికీ ఉండాలి. అప్పుడే అందరూ కలసిమెలసి, కుటుంబం అభివృద్ధికి పాటుపడతారు. అందరూ సంపాదిస్తారు. ఒకరి అవసరాలకు మరొకరు సాయపడతారు. ‘మన’ అనే భావన లేకపోతే సమష్టి కుటుంబం అనేది సక్రమంగా నడువదు. స్వార్థపరత్వం పెరుగుతుంది. పరస్పరం పోటీ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, తగవులు వస్తాయి. అప్పుడు అందరూ కలసిమెలసి ఉండలేరు. ఎవరిమట్టుకు వార్కి తమకు, తమ పిల్లలకు అనే భావనలు వస్తాయి.
భాషల మధ్య జరిగే ఆధానప్రదానాలను చర్చించండి?
ఒక భాషా పదాన్ని మరొక భాష స్వీకరించడం కొత్తేమీకాదు. పలు భాషలు మాట్లాడే ప్రజలు ఒక చోట కలిసి మెలసి ఉన్నప్పుడు భాషలలో ఆదాన ప్రదానాలు సహజంగా జరుగుతుంటాయి. ఒక భాషా పదాన్ని వేరొక భాష స్వీకరించేటప్పుడు ఏదో ఒక విభక్తి ప్రత్యయాన్ని చేర్చి ఆ భాషా పదాన్ని మరొక భాషాపదం స్వీకరిస్తుంది. ఒక్కొక్కసారి యథాతదంగాను లేదా ఒక అక్షరాన్ని చేర్చి, ఒక అక్షరాన్ని తీసేసి, లేదా ఒక అక్షరాన్ని మార్చి స్వీకరించటం జరుగుతుంది. స్వీకరించిన భాష తాను స్వీకరించిన మూల భాషా పద అర్థాన్నే స్వీకరిస్తుంది. కొన్ని సందర్భాలలో వేరే భాషా పదాన్ని స్వీకరించిన భాష మూల భాష యొక్క అర్థాన్ని కాక కొత్త అర్థంలో కూడ స్వీకరించడం జరుగుతుంది. ఇలా భారతీయ భాషలన్నింటిలోనూ సంస్కృత భాషా ప్రభావం అధికంగా ఉంది. అలాగే ఆంగ్లభాషా ప్రభావం కూడా! అన్య భాషా పదాలను స్వీకరించడంలో వర్ణాగమ, వర్ణాలోప, వర్ణవ్యత్యయాల ద్వారా ఆదాన ప్రదానాలు జరుగుతుంటాయి. ఉదాహరణకు :- లార్డ్ అనే ఆంగ్లపదం ఉర్దూలోకి ‘లాట్సాహెబ్’గా మారటం. ఫిలాసఫీ అనే ఆంగ్లపదం ఫల్సఫాగా ఉర్దూలోకి రావటం సొహబత్ అనే ఉర్దూపదం తెలుగులో ‘సోబతి’ అవటం. ఉర్దూలో ఆబ్రూ అనే పదం తెలుగులో ఆబోరుగా మారటం వర్ణలోప వర్ణాగమ. వర్ణవ్యత్యయాలకు ఉదాహరణులుగా చెప్పవచ్చు.
సరీసృపాల విభాగంలో వర్తమాన క్రమాలను తెలపండి. ప్రతీ క్రమానికి రెండు ఉదాహరణలు ఇవ్వండి.
వర్తమాన సరీసృపాలను నాలుగు క్రమాలుగా ఏర్పరచారు : 1. కిలోనియా : కిలోన్ (సముద్ర ఆకుపచ్చ తాబేలు), టెస్టుడో (భౌమ్య తాబేలు), ట్రియోనిక్స్ (మంచినీటి తాబేలు). 2. రింకోసెఫాలియా : స్ఫీనోడాన్ (సజీవ శిలాజం-న్యూజిలాండ్కి పరిమితమై ఉంటుంది) 3. క్రొకోడీలియ : క్రొకోడైలస్ పాలుస్ట్రీస్ (భారతదేశం మొసలి లేదా మగర్), అలిగేటర్, గేవియాలిస్, గాంజిటికస్ (భారతదేశ గేవియాల్ లేదా ఘరియాల్) 4. స్వామేటా ఎ) బల్లులు/తొండలు : హెమిడాక్టైలస్ (గోడబల్లి), కెమిలియాన్ (ఊసరవెల్లి), డ్రాకో (ఎగిరే బల్లి) బి) పాములు (సర్పాలు) 1) విష సర్పాలు : నాజ నాజ (నాగుపాము), ఒఫియోఫాగస్ హన్న (రాచనాగు), బంగారస్ (కట్లపాము/క్రెయిట్), డబొయ/వైపరా రసెల్లి (గొలుసు రక్తపింజరి) 2) విషరహిత సర్పాలు : ట్యాస్ (రాట్ స్నేక్/జెర్రిగొడ్డు), ట్రోపిడోనోటస్ (నీటి పాము/నీరుకట్టె)
సంగం యుగంలోని ప్రధాన అంశాలను వివరించండి.
సంగం యుగంలో ఈ క్రింది అంశాలు కలవు. అవి. రాజకీయ వ్యవస్థ: నాడు నిరంకుశ రాజరికపు వ్యవస్థ అమల్లో వుంది. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. సభ అనే ప్రజాసభ పరిపాలన, న్యాయ వ్యవహారాల్లో రాజుకు సలహాలను ఇచ్చేది. గ్రామపాలనను గ్రామ సంఘాలు నిర్వహించేవి. చతురంగ బలాలతో పాటు రాజు నౌకాదళాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. యుద్ధంలో పాల్గొనడం, యుద్ధంలో వీరమరణం పొందడం గౌరవప్రదమైందిగా భావించేవారు. సాంఘిక,ఆర్థిక, మతజీవనం: చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉండేది. వనం, వరైని, తుడియం, కడంబన్ అనేవి చతుర్వర్ణాలు. అయితే వర్ణ వ్యవస్థ నిరంకుశంగా ఉండేది కాదు. సమాజంలో బ్రాహ్మణులు గౌరవప్రదమైన స్థానాన్ని అనుభవించేవారు. వ్యాపారులు, సంపన్నులు సుఖమయమైన జీవితాన్ని గడిపారు. బానిస వ్యవస్థ అమలులో ఉన్నట్లు ఆధారాలున్నాయి. వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి, పశుపోషణ, కుండల తయారి, నేతపని వంటి వృత్తులు కూడా ఉండేవి. ప్రజల ఆర్థిక జీవనాన్ని శ్రేణులు క్రమబద్ధీకరించేవి. శ్రామికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళే పద్ధతి అమలులో వుంది. ప్రజల మత జీవనంలో వైదిక పద్ధతి, తమిళ సంప్రదాయం మిళితమై కనిపిస్తాయి. ప్రాచీన తమిళులు ప్రకృతి శక్తులు, సర్పాలు, వివిధ పిశాచాలను ఆరాధించేవారు. దేవతలకు యజ్ఞయాగాలను సమర్పించారు. దేవాలయ పూజా విధానంలో సంగీత, నృత్యాలు భాగంగా ఉండేవి. నాడు ప్రజలు శైవమతాన్ని అధికంగా అవలంబించారు. శివుడు, సుబ్రహ్మణ్యస్వామి ప్రధాన దేవతలు. సాహిత్యం: సంగం యుగంలో తమిళ సాహిత్య చరిత్ర ప్రారంభమైంది. ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని ‘తోలకప్పియార్’ రచించాడు. ‘కురల్’ అనే ప్రసిద్ధ కావ్యాన్ని తిరువళ్ళువార్ రచించాడు. నైతిక విలువలతో కూడిన ఈ కావ్యం తమిళుల జీవితాల్లో ప్రధాన పాత్ర పోషించింది. జైన, బౌద్ధ కవులు, రచయితలు కూడా సంగం సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.
దేహ సమఖండీభవనానికి సంబంధించిన స్వరూప లక్షణాల ఆధారంగా ఒక హైరుడినీయన్ ను ఇతర అనెలిడ్ నుంచి ఎలా గుర్తిస్తారు? శరీర కుహర అంశాలకు సంబంధించి జలగ శరీర కుహరం వానపాము శరీరకుహరం నుంచి ఏ రకంగా భిన్నమైంది?
దేహం పృష్టోదర తలాలలో అణచబడి, నిర్దిష్ట సంఖ్యలో ఖండితాలు కలిగి ఉంటుంది. ఖండితాలు బాహ్యంగా ఉపఖండితాలుగా విభజింపబడి ఉంటాయి. జలగ శరీర కుహరము బొట్రాయిడల్ కణములతో నిండి ఉంటుంది. వానపాము శరీర కుహరం శరీర కుహర ద్రవముతో నింపబడి ఉండును.
ప్రశ్న : నేడు మనం నిప్పును దేనికి ఉపయోగిస్తున్నాం?
నేడు మనము నిప్పును క్రింది విధంగా ఉపయోగిస్తున్నాము. ఆహారాన్ని వండుకుని తినుటకు వెచ్చదనం పొందటానికి, నీటిని వేడి చేయటానికి. మతానికి సంబంధించిన క్రతువులలో, కర్మకాండలలో కొన్ని రకాల పంటల ప్రాసెసింగ్ లో (ఉదా : పొగాకును కాల్చుట) వివిధ రకాల పరిశ్రమలలో (ఉదా : ఇనుము – ఉక్కు పరిశ్రమలో, సిమెంట్ పరిశ్రమలలో) వెల్డింగ్ పనుల్లో బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయుటకు బంగారం, వెండి మొదలైన లోహాలను కరిగించడానికి, నాణెలు, బొమ్మలుగా చేయుట కొరకు. చల్లని రాత్రులలో వెచ్చదనం కోసం.
ఊపిరితిత్తుల యొక్క ప్రత్యేకత ఏమిటి?
మన శరీర అవయవాలలో నీటిపైన తేలే ఒక అవయవం ఊపిరితిత్తులు. ఇవి బెలూన్ లాగా వ్యాకోచించే సామర్థ్యంతో 1200 మి.లీ వాయువును ఎప్పుడూ కలిగి ఉంటాయి. వీటి పూర్తి సామర్థ్యం 5900 మి.లీ.
కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. తెల్లవారడం తడవుగా వెళ్ళి రాణేదారు పాదాల మీద వాలిపోయాడు ఖాను. ఇంతవరకూ అంత గొప్ప అత్తర్లు పెద్దాపురం కోటకు రాలేదన్న సంగతి రాణేదారుకి తెలుసు. ఖానుకి మంచి సన్మానం జరగడం దివాంజీకి సుతరామూ ఇష్టం లేదు. ఇది తెలుసు ఇతనికి. బుర్ర ఎగిరిపోడానికి కయినా ఒప్పుకుంటాడు గానీ భాను సరయిన ధర చెప్పడు ఇదీ తెలుసు అతనికి. అయితే మాత్రం మహారాజు చూశాడంటే భాను అత్తర్లు విడిచిపెట్టడు. ఈ విషయాన్ని ఆ సమయంలో దివాంజీ దగ్గర వుండిన వారందరూ గుర్తించేశారు. ప్రశ్నలు: 1. ఖాను ఎవరి పాదాల మీద వాలిపోయాడు? 2. భానుకి సన్మానం జరగడం ఎవరికి ఇష్టం లేదు? 3. అత్తరు చూశాడంటే విడిచిపెట్టనిది ఎవరు? 4. ఈ పేరా ఆధారంగా దివాంజీ ఎలాంటి స్వభావం గలవాడు?
1. ఖాను ఎవరి పాదాల మీద వాలిపోయాడు? జవాబు: భాను ఠాణేదారు పాదాలమీద వాలిపోయాడు. ఉంది. 2. భానుకి సన్మానం జరగడం ఎవరికి ఇష్టం లేదు? జవాబు: భానుకి సన్మానం జరగడం దివాంజీకి సుతరామూ ఇష్టం లేదు. 3. అత్తరు చూశాడంటే విడిచిపెట్టనిది ఎవరు? జవాబు: అత్తరును చూశాడంటే విడిచిపెట్టనిది మహారాజు. 4. ఈ పేరా ఆధారంగా దివాంజీ ఎలాంటి స్వభావం గలవాడు? జవాబు: ఈ పేరా ఆధారంగా దివాంజీ అసూయాపరునిగా తెలుస్తుంది.
వర్గీకరణ అంటే ఏమిటి? వర్గీకరణ ఆవశ్యకతను తెలియజేయండి.
ప్రపంచంలోని అన్ని సజీవుల గురించి అధ్యయనం చేయడం అసాధ్యం. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి జీవులను వర్గీకరిస్తారు. జీవులను వాటి గుర్తింపు లక్షణాల ఆధారంగా అనుకూలమైన సమూహాలుగా విభజించే పద్ధతిని వర్గీకరణ అంటారు. ఈ అనుకూలమైన సమూహాలనే శాస్త్రీయ పరిభాషలో టాక్సా (ఏకవచనం : టాక్సాన్) అంటారు. టాక్సా వర్గీకరణలోని వివిధ స్థాయిలను సూచిస్తుంది. ఉదాహరణకు రాజ్యస్థాయి టాక్సాన్ – ఏనిమేలియా, వర్గస్థాయి టాక్సాన్ – కార్డేటా, విభాగస్థాయి టాక్సాన్ – మమ్మేలియ మొదలైనవి. జీవులను వర్గీకరించే పద్ధతినే వర్గీకరణ శాస్త్రం అంటారు. జీవుల ఆధునిక వర్గీకరణ వాటి బాహ్య, అంతర నిర్మాణాలు, కణాల నిర్మాణం, అభివృద్ధి ప్రక్రియలు పరిసరాలతో సంబంధం మొదలైన అంశాలు ఆధారం. జీవుల లక్షణీకరణం, గుర్తింపు, నామీకరణ, వర్గీకరణ అనే ప్రక్రియలు జీవ వర్గీకరణలోని ప్రధాన అంశాలు. వర్గీకరణ సాధనాలుగా జంతు ప్రదర్శనశాలలు : వన్య జంతువులను వాటి సహజ ఆవాసాల నుంచి సేకరించి మానవ సంరక్షణలో పెంచే ప్రదేశాలను జంతు ప్రదర్శనశాలలు అంటారు. (స్థల బాహ్య సంరక్షణ) ఆ జంతువుల బాహ్య లక్షణాలు, ఆహారపు అలవాట్లు, ప్రవర్తన (ఇథాలజీ) మొదలైన వాటిని పరిశీలించడానికి వాటి ఆధారంగా జంతువులను వర్గీకరించడానికి జంతు ప్రదర్శనశాలలు అవకాశం కలిగిస్తాయి. ప్రదర్శనశాలలు : మరణించిన జీవుల నమూనాలను గాజుపాత్రలు, గాజు జాడీలలో వాటి శరీరాలు పాడవకుండా తగిన సంరక్షణ ద్రావణాలలో ఉంచే ప్రదేశాలే ప్రదర్శనశాలలు. వీటిలో కొన్ని జంతువులను పొడినమూనాలుగా చేసి భద్రపరుస్తారు. కీటకాలను సేకరించి చంపి, కాగితపు షీట్లపై గుచ్చి గాజుపెట్టెలలో భద్రపరుస్తారు. పక్షులు, క్షీరదాలు లాంటి పెద్ద జంతువుల లోపలి అవయవాలను తీసివేసి వాటి స్థానంలో రంపపు పొట్టు, ఉనక / ఊక లాంటి పదార్థాలను దట్టించి భద్రపరిచి ప్రదర్శిస్తారు. వివిధ జంతువుల అస్థిపంజరాలను కూడా సేకరించి ప్రదర్శిస్తారు. వీటి ఆధారంగా కూడా జంతువులను వర్గీకరించవచ్చు.
ప్రశ్న : యేసుక్రీస్తు ప్రధాన బోధనలు ఏవి?
యేసుక్రీస్తు ప్రధాన బోధనలు : మానవులందరూ దేవుని పిల్లలు. పాపాలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడపండి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని కూడా ప్రేమించండి. ఒక చెంపపై కొట్టినప్పుడు, మరొక చెంప చూపించు. మానవసేవే మాధవసేవ. శాంతి, ప్రేమ, కరుణ కల్గి ఉండాలి. తనను తాను తగ్గించుకొనువాడు దేవునిచే హెచ్చింపబడును. శత్రువును కూడా ప్రేమతో జయించవచ్చు.
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధాలు మరియు భావం రాయండి క. అలయించుచుఁ, దిన్నండు దన కల లోపలఁగన్న శివునిఁ గనుఁగొనుదాఁకన్ జలమునఁ గొని చనెనయ్యే కల మప్పు డదృశ్యమైనఁ గడుంజోద్యమునన్.
ప్రతిపదార్థం : అలయించుచు = విసిగించుతూ తిన్నడు = తిన్నడు అనువాడు తన = తనయొక్క కలలోపల = స్వప్నములో కన్న = చూసిన / దర్శించిన శివునిన్ = ఈశ్వరుని కనుఁగొనుదాఁకన్ = చూసేవరకు చలమునన్ = పట్టుదలతో కొనిచనిన = తీసుకొని పోయిన ఆ + ఏకలము = ఆ అడవి పంది అప్పుడు = ఆ సమయంలో కడున్ = మిక్కిలి చోద్యమున్ = ఆశ్చర్యకరంగా అదృశ్యము + ఐనన్ = మాయమయింది భావం : తిన్నడికి చిక్కకుండా విసిగించుతూ, తిన్నడు స్వప్నములో చూసిన ఈశ్వరుని చూసేవరకు, పట్టుదలతో తీసుకొనిపోయిన అడవిపంది ఆ సమయంలో అదృశ్యమవగా మిక్కిలి ఆశ్చర్యపడెను.
సంగం యుగం నాటి సాహిత్యం గురించి సంక్లిప్తంగా వివరించండి
సంగం యుగంలో తమిళ సాహిత్య చరిత్ర ప్రారంభమైంది. ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని తోలకప్పియార్ రచించాడు. ‘కురల్’ అనే ప్రసిద్ధ కావ్యాన్ని తిరువళ్ళువార్ రచించాడు. నైతిక విలువలతో కూడిన ఈ కావ్యం తమిళుల జీవితాల్లో ప్రధానపాత్ర పోషించింది. జైన, బౌద్ధ కవులు, రచయితలు కూడా సంగం సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.
px + q రేఖీయ బహుపది యొక్క శూన్య విలువను రాయండి.
px + q = 0 ⇒ px = – q ⇒ x = −q/p ∴ px + q యొక్క శూన్య విలువ −q/p
ఇచ్చిన పద్యానికి భావం రాయండి: కం. రోషావేశము జనులకు దోషము, తలపోయ విపుల దుఃఖకరము నౌ; రోషము విడిచిన యెడ సం చూస్తే యమధర్మరాజు నవ్వుతాడు. తోషింతురు బుధులు హితము దోప కుమారా !
ఓ కుమారా ! కోపం, ఉద్రేకం కలిగి ఉండడం చాలా తప్పు. ఆలోచించగా అవే బాధలను కలిగిస్తాయి. కోపం విడిచి పెడితే పండితులు సంతోషిస్తారు. మంచి జరుగుతుంది.
‘సీత సంగీతం, నృత్యం నేర్చుకుంటున్నది’ – ఇది ఏ రకమైన వాక్యం? A) సామాన్య వాక్యం B) సంయుక్త వాక్యం C) సంక్లిష్ట వాక్యం D) మహావాక్యం
B) సంయుక్త వాక్యం
‘చల్లని తల్లి చక్కని చెల్లి’ అని శాంతిని ఉద్దేశిస్తూ ‘ప్రకటన’ కవితను రచించిన కవిని గురించి రాయండి.
దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రకటన కవితను రాశాడు. ఈ కవిత ఆయన రచించిన ‘అమృతం కురిసిన రాత్రి’ అనే కవితా సంకలనంలోది. తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో – 1921లో జన్మించాడు. ఈయన అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు, తిలక్ కథలు రచించాడు. 1971లో ఈయన అమృతం కురిసిన రాత్రి అనే కవిత సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
ప్రశ్న రవాణా మరియు వాణిజ్యాల మధ్య సంబంధం ఉందని మీరు భావిస్తున్నారా? నీ సమాధానాన్ని సమర్థింపుము.
రవాణా మరియు వాణిజ్యాల మధ్య సంబంధం ఖచ్చితంగా ఉందని నేను భావిస్తున్నాను. వ్యాపారులకు, చేతి వృత్తుల వారికి రవాణా మార్గాలు చాలా ముఖ్యమైనవి. ఈ రవాణా మార్గాలు పెద్ద పట్టణాలను, ఓడరేవులను మరియు ఇతర దేశాలను కలుపుతాయి. అభివృద్ధి చెందిన రవాణా మార్గాల వల్లనే (విదేశీ) వాణిజ్యం అభివృద్ధి చెందుతుంది. రవాణా సౌకర్యాలు ఎంత ఎక్కువగా అందుబాటులో ఉంటే వ్యవసాయ, వివిధ పరిశ్రమల ఉత్పత్తులను అంత ఎక్కువగా ప్రజలకు చేరువ చేయవచ్చు (వాణిజ్యం ద్వారా) ఉదా : విదేశాలలో తయారైన ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఫోన్లు స్థానిక మార్కెట్లో లభ్యమవ్వడం.
యార్లగడ్డ బాలగంగాధరరావు గురించిన విశేషాలేమిటి ?
ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు కృష్ణా జిల్లా దివిసీమకు సమీపంలో ఉన్న చల్లపల్లి ఎస్టేటులోని పెదప్రోలు గ్రామంలో 1.7.1940వ తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు కృష్ణవేణమ్మ, భూషయ్య. వీరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. నామ విజ్ఞానంపై ప్రత్యేక అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ స్థాయికి చెందిన అనేక సంస్థల్లో వీరు చిరకాల సభ్యులుగా కొనసాగారు. నామ విజ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాలపై అనేక గ్రంథాలను రచించారు. ఒక ఊరి కథ (1995), మాటమర్మం (2000), ఇంటి పేర్లు (2001), అక్షరయజ్ఞం (2001) వంటివి ఈ కోవకు చెందిన గ్రంథాలే. ఇవేకాక, క్రీడాభిరామం, పల్నాటి వీరచరిత్ర, రాధికాస్వాంతనం వంటి కొన్ని కావ్యాలను వచనంలోకి అనువదించి. వ్యాఖ్యలు రాశారు. మహాభారతానికి వీరు అందించిన విశేష వ్యాఖ్య బహుళ ప్రాచుర్యం పొందింది. తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషి చేసిన యార్లగడ్డ వారు 23.11.2016న మరణించారు
రేఖీయ సమీకరణాల జత-I సాధన-II i) 7x + y = 10 5x – y = 2 అయిన a) x= 0, y = 0 ii) 5x – y = 0 7x + y = 0 అయిన b) సాధన లేదు iii) x + y = 5, 2x + 2y = 10, అయిన c) x = 1, y = 3 iv) x + y = 5 x – y = 1, అయిన d) x = 3, y = 2 అయిన జతపరచడంలో సరైన దానిని ఎన్నుకొనుము. A) i – c, ii – b, iii – a, iv-d B) i- c, ii-b, iii – d, iv – a C) i-b, ii – c, iii – a, iv-d D) i- c, ii – a, iii – b; iv-d
C) i-b, ii – c, iii – a, iv-d
ముడి ధాతువుతో కలిసి ఉన్న మలినాలను అంటాం. A) గాంగ్ B) ద్రవరారి C) లోహమలం D) ఖనిజం
A) గాంగ్
పూర్తి అవ్యాకోచ డిమాండ్ గురించి సంక్లిప్తంగా వివరించండి
ధరలో ఎంత మార్పు వచ్చినా డిమాండ్లో ఏ మాత్రము మార్పు ఉండదు. దీనినే పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ రేఖ Y- అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీని సంఖ్యాత్మక విలువ Ep = 0
క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి వెలసిన ముఖ్య వృత్తులు ఏవి?
6వ శతాబ్దం నాటికి దాదాపు అరవై నాలుగు రకాల వృత్తులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వృత్తులను రెండు రకాలుగా భావించారు. అవి కొన్ని ఉన్నత స్థాయి, కొన్ని క్రింది స్థాయి వృత్తులుగా భావించారు. వడ్రంగులు దంతపు వస్తువుల తయారీదార్లు, నేత పనివారు, కంసాలి మొదలైనవి ఉన్నత వృత్తులుగా భావించబడ్డాయి. వేటగాళ్ళు, చేపలు పట్టేవారు, కటిక వృత్తి, చెప్పులు కుట్టడం, కుమ్మరులను తక్కువ వృత్తికారులుగా భావించేవారు.
ఆంధ్రరాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు త్యాగం గురించి సొంత మాటల్లో రాయండి.
ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ప్రకటించే వరకు తన దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తానని 19. 10. 1952న పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించారు. 15. 12. 1952 వరకు ఆమరణ దీక్ష కొనసాగించారు. ఆ రోజు రాత్రి 11.30 కి ఆయన హృదయ స్పందన ఆగిపోయింది. మూడు రోజుల పాటు ఆంధ్ర అగ్నిగుండమయింది. ఆంధ్ర ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రరాష్ట్రం గురించి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు. ఆ అమరజీవి త్యాగాన్ని ఆంధ్రజాతి ఉన్నంతవరకు మరచిపోదు.
ఇచ్చిన గద్యానికి కొనసాగింపుగా ఒక పేరా రాయండి: తెల్లవారుతుండగా పోలీసులు గ్రామంలోకి ప్రతి ఇల్లును సోదాచేస్తున్నారు. గొల్ల రామవ్వ ఇంటికి కూడా వచ్చారు. ఆమె భయపడిపోయింది. కాంగ్రెస్ వాలంటీర్ అయిన ఆ యువకుని ఎలాగైనా రక్షించాలనుకుంది. తన మనవరాలిని గొంగళితో ఆయువకుని కప్పి ఉంచమన్నది. వారిద్దరిని ఒకే మంచంపై పడుకోమని ఆజ్ఞాపించింది. అతనికి గొల్లవేషం వేయించింది. ఇంటిలోపలికి ప్రవేశించిన పోలీసులతో ఆ పిల్లలిద్దరూ నా మనవరాలు ఆమె పెనిమిటి అని బొంకింది. పోలీసోడు గొల్లరామవ్వను వాడు ఎవడన్నావ్. కాంగ్రెసోడా ఏం అని ప్రశ్నించిన రామవ్వ కంగారు పడలేదు.
పోలీసులు వెళ్ళిపోయారు. రామవ్వ మంచం మీద కూర్చొంది. ఒక వైపు యువకుడు, మరోవైపు ఆమె మనవరాలు వారిది అపూర్వ సమ్మేళనం అన్పించింది ఆ యువకునికి “అవ్వా! నీవు సామాన్యురాలివి కావు. ‘సాక్షాత్ భరతమాతవే’ అన్నాడు. ఇలా ఒక విప్లవ కారుని సామాన్య వృద్ధురాలు రక్షించిన కథే గొల్ల రామవ్వ కథ.
విశ్వసమితికి గుర్తును రాయండి.
µ
నమోదు అంటే ఏమిటి ? నమోదు ఖాతాలను వివరించండి.
చిట్టాలోగాని, సహాయక చిట్టాలో గాని నమోదు చేసిన పద్దులు ఆవర్జాలో సంబంధిత ఖాతాను ప్రారంభించి అందులో వ్రాయడాన్ని ‘ఆవర్జాలో నమోదు చేయడం’ అంటారు. చిట్టాలలో రాసిన పద్దులన్నింటిని ఆవర్జాలో వాటికి సంబంధించిన ఖాతాలలో నమోదు చేయడం వలన, ఒక నిర్ణీత కాలానికి సంబంధించిన ఖాతాల నికర మొత్తాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. నమోదుకు సంబంధించిన నియమాలు : చిట్టాపద్దులను ఆవర్జాలోకి నమోదు చేసేటపుడు దిగువ అంశాలను పరిగణనలోకి తీసుకోవలెను. 1) ఖాతాల ఏర్పాటు : ప్రతి వ్యవహారములోను రెండు ఖాతాలు ఉంటాయి. వాటికి వేరు వేరుగా ఆవర్జాలో ఖాతాలను ఏర్పాటుచేయాలి. ఈ ఖాతాలు వ్యక్తిగత, వాస్తవిక, నామమాత్రపు ఖాతాలకు సంబంధించినవై ఉండవచ్చు. ఖాతా నికర ఫలితాన్ని తెలుసుకోవడానికి వ్యాపార వ్యవహారముల డెబిట్, క్రెడిట్ మొత్తాలను సంబంధిత ఖాతాలో నమోదు చేయాలి. 2) చిట్టాపద్దును ఖాతాలో నమోదు : ఖాతా అంశము చిట్టాపద్దులో డెబిట్ పంక్తిలో ఉంటే డెబిట్ వైపు, ఖాతా అంశము ‘క్రెడిట్ పంక్తిలో ఉన్నప్పుడు క్రెడిట్ వైపు నమోదు చేయాలి. 3) TO, By పదములు ; ఖాతాలో డెబిట్ వైపు వివరాల వరసలో To అనే పదముతో, క్రెడిట్ వైపు By” అనే పదముతో ప్రారంభించాలి. 4) ఖాతా నిల్వ : ఖాతాలోని డెబిట్ వరుస మొత్తము, క్రెడిట్ వరుస మొత్తము తేడా ఖాతా నిల్వను సూచిస్తుంది.
ఇచ్చిన సంధి గురించి రాయండి మరియు ఉదాహరణలు కూడా రాయండి: యణాదేశ సంధి
ఇ, ఉ, ఋలకు వాని అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమంగా య, వ, రలు ఆదేశమగును. అత్యంత = అతి + అంత = యణాదేశ సంధి ధుర్యాత్మ = ధురి + ఆత్మ = యణాదేశ సంధి
పంపిణీ భావనలను వివరించండి.
అర్థశాస్త్రంలో పంపిణీ భావనను రెండు అర్థాలలో ఉపయోగించడం జరుగుతుంది. అంటే జాతీయాదాయ పంపిణీని రెండు విధాలుగా పరిశీలించవచ్చు. విధులననుసరించి పంపిణీ. వైయక్తిక పంపిణీ 1) విధులననుసరించి పంపిణీ: ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలు సేవలందించినందుకు గాను, అవి ప్రతిఫలాలుగా భాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో పొందుతాయి. ఒక ఉత్పత్తి కారకం ఏవిధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో విధులననుసరించి పంపిణీ తెలియజేస్తుంది. కొంతమంది. ఒకటికంటే ఎక్కువ ఉత్పత్తి కారకాలకు యజమానులుగా ప్రతిఫలాలను పొందవచ్చు. ఒక ఉత్పత్తి కారకం ఏవిధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో విధులననుసరించి పంపిణీ తెలుపుతుంది. విధులననుసరించి జరిగే పంపిణీని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. a) సూక్ష్మ పంపిణీ: సూక్ష్మ పంపిణీ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు ఒక ఉత్పత్తి కారకం ధర ఏవిధంగా ఎంత నిర్ణయించబడుతుందో వివరిస్తుంది. ఉదా: శ్రామికుల వేతన రేటు నిర్ణయం. b) స్థూల పంపిణీ: జాతీయాదాయంలో వివిధ ఉత్పత్తి కారకాల వాటా ఎంత ఉందో పంపిణీ స్థూల వివరిస్తుంది. ఉదా: మొత్తం జాతీయాదాయంలో వేతనాల వాటా ఎంత ఉంది అనే విషయాన్ని స్థూల పంపిణీ తెలియజేస్తుంది. 2) వైయక్తిక పంపిణీ: దేశంలోని వ్యక్తుల మధ్య జాతీయాదాయాన్ని పంపిణీ చేయడాన్ని వైయక్తిక పంపిణీ అంటారు. ఇక్కడ వ్యక్తులు ఎంత ఆదాయం పొందుతున్నారు అనే విషయాన్ని పరిశీలిస్తారు. అంతేగాని ఏవిధంగా లేదా ఎన్ని విధాలుగా పొందారు అనే విషయ పరిశీలన ప్రధానం కాదు. వైయక్తిక పంపిణీ పరిశీలన ద్వారా ఆదాయ అసమానతలను అందుకు గల కారణాలను తెలుసుకోవచ్చు.
సూర్యుని ఊర్ధ్వకోణం 0° నుండి 90° పెరుగుతూ ఉంటే, స్థంభము యొక్క నీడ పొడవు _________ A) మార్పులేదు B) పెరుగుతుంది C) తగ్గుతుంది D) చెప్పలేము
C) తగ్గుతుంది
ఆర్థిక భాటకం గురించి సంక్లిప్తంగా వివరించండి
ఆర్థిక భాటకం కేవలం భూమికే పరిమితం కాకుండా మిగతా మూడు ఉత్పత్తి కారకాలైన శ్రమ, మూలధనం, వ్యవస్థాపనకు వర్తిస్తుంది. ఇది మూడు రకాలు కొరత భాటకం కృత్రిమ భాటకం బదిలీ సంపాదన
ఏకవలయ రక్తప్రసరణ వ్యవస్థ కల జీవి A) కప్ప B) నత్త C) కోడి D) చేప
D) చేప
బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అంటే ఏమిటి?
నగదు పుస్తకము, పాస్బుక్ నిల్వలను సమన్వయము చేయడానికి తయారుచేసే నివేదికను బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అంటారు. నగదు పుస్తకము, పాస్బుక్ వేర్వేరు నిల్వలను చూపుతున్నప్పుడు, తేడాలు చూపడానికి గల కారణాలు కనుక్కొని, వాటని సమన్వయము చేయడానికి తయారుచేసే పట్టికను బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అంటారు. ఈ పట్టికను నిర్దిష్ట కాలానికి అనగా నెలకు లేదా ఆరు నెలలకుగాని తయారుచేస్తారు. బ్యాంకులో తనకున్న నిల్వ మొత్తము లేదా బ్యాంకుకు తాను ఋణపడిన బాకీ మొత్తము ఖచ్చితముగా తెలుసుకోవడానికి వ్యాపారస్తునకు ఈ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక ఉపయోగపడుతుంది.
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధాలు మరియు తాత్పర్యం రాయండి: కాపాడుదురుమిమ్ము కనిపెట్టియుండి పరరాజులను గెల్వ పైకొనిపోయి అమితమ్ముగాగ ధనాదులనెల్ల కొనవచ్చు ధర్మముల్ కూర్పంగవచ్చు సత్మీర్తి జగముల సాంద్రమైనిల్చు కలహించి వెనుకటి కౌరవులెల్ల గతిచెడి పడినట్టి కష్టముల్ వినమె పగ పెరిగించుట భావ్యంబుగాదు ఉభయవాదులు మీరలొక్కటి కనుక నయమొప్ప జెప్పితి నా మాట వినుడి
ప్రతిపదార్థం : మిమ్ము = మిమ్మల్ని కనిపెట్టి + ఉండి = కనిపెట్టుకొని యుండి కాపాడుదురు = కాపాడతారు పరరాజులను = శత్రురాజులను గెల్వన్ = జయించటానికి పైకొనిపోయి = దండెత్తి వెళ్ళి అమితమ్ముగాక = అమితంగా ధన + ఆదులన్ + ఎల్ల = సంపదలెన్నింటినో కొనవచ్చు. = పొందవచ్చు ధర్మముల్ = ధర్మపాలనను కూర్పంగవచ్చు = సాగించవచ్చు సత్కీర్తి = గొప్పకీర్తి జగముల = లోకాలలో సాంద్రమై నిల్చు = శాశ్వతంగా నిల్చిపోతుంది కలహించి = యుద్ధం చేసి వెనుకటి = పూర్వం కౌరవులు + ఎల్ల = కౌరవులంతా గతిచెడి = నాశనమై పడినట్టి కష్టముల్ = పడిన కష్టాలు వినము + లు = వినలేదా పగ = పగను పెరిగించుట = పెరిగేటట్లు చేయటం భావ్యంబు + కాదు = మంచిది కాదు ఉభయవాదులు= ఇరుపక్షాలవారైన మీరలు = మీరు ఒక్కటి కనుక = ఒక్కటే కాబట్టి నయము + ఒప్పన్ = పరిష్కారంగా చెప్పితి = చెప్పాను నా మాట = నా మాట వినుడి = వినండి తాత్పర్యం : ఓ రాజా ! ధనం సంపాదించగలిగినపుడు సేవకులు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండి కాపాడుతారు. శత్రురాజ్యాలపై దండెత్తి వెళ్ళి జయించి ఎన్నో సంపదలను పొందవచ్చు. ధర్మపాలనను సాగించవచ్చు. అప్పుడు గొప్ప కీర్తి లోకాలలో శాశ్వతంగా నిలిచిపోతుంది. పూర్వం యుద్ధం చేసి కౌరవులు నాశనమై పడిన కష్టాలు విన్నాం కదా ! పగను పెరిగేటట్లు చేయటం మంచిది కాదు. ఇరుపక్షాలవారైన మీరు ఒక్కటే కాబట్టి పరిష్కారంగా చెప్పాను. నా మాట వినండి అని తాత్పర్యం.
ఒక పౌనఃపున్య విభాజనం యొక్క తరగతులు 1 -9, 10 – 18, 19 – 27, ….. అయిన తరగతి పొడవు (l) ను కనుగొనుము.
తరగతి అంతరం (l) = 9
e – వ్యాపారం వల్ల సంస్థలకు కలిగే ప్రయోజనాలు ఏవి ?
e – వ్యాపారం వల్ల వ్యాపార సంస్థలకు కలిగే ప్రయోజనాలు : e – వ్యాపారము వలన సంస్థలు తమ ప్రస్తుత మార్కెట్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు విస్తరింపచేసుకోవచ్చు. ఇది సంస్థ యొక్క అమ్మకాలను పెంచుతుంది. e– వ్యాపారము వలన వస్తువులను లేదా సేవలను సృష్టించడము, ప్రాసెసింగ్ చేయడం, పంపిణీ చేయడం, స్టోరింగ్ చేయడం, సమాచారాన్ని సేకరించడానికి అయ్యే వ్యయం తగ్గుతుంది. ఇన్వెంటరీ నిల్వ చేయడానికి, ఓవర్హెడ్ ఖర్చులు తగ్గుతాయి. పెట్టుబడికి, వస్తు సేవల అమ్మకం వలన వచ్చే ఆదాయానికి మధ్య ఉన్న సమయం తగ్గుతుంది. బిజినెస్ ప్రాసెస్, రీ- ఇంజనీరింగ్లకు సహకరిస్తుంది. టెలీ కమ్యూనికేషన్ ఖర్చు తక్కువగా ఉండటం వలన ఇంటర్నెట్ విలువ ఆధారిత నెట్వర్క్ వ్యయము కంటే తక్కువగా ఉంటుంది.
క్రింద ఇచ్చిన సినిమా పాటలోని ఒక భాగం యొక్క సాహిత్యంపై విశ్లేషణ చెయ్యండి: సర సస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం
సరస = మంచి రసము గల; స్వర = సంగీతము; సుర = దేవతల; ఝరీ = నది లేదా ప్రవాహం; గమనం = తలపు లేదా ప్రయాణం; విరించి = బ్రహ్మ; విరచించు = విశేషముగా రచించు; కవనం = కవిత్వం; విపంచి = వీణ. మంచి భావము గల సంగీతమును కలిగిస్తున్న గంగా నదిని తలపిస్తున్న సామవేదం యొక్క సారంశం, నేను పాడిన ఈ గీతం. ఇది జీవితానికి సంబంధించిన గీతం. బ్రహ్మ వలె బహు గొప్పగా రచించాను ఈ కావ్యముని, వీణనై వినిపించాను ఈ పాటని.
ఇచ్చిన గద్యానికి కొనసాగింపుగా ఒక పేరా రాయండి: గోలకొండ కోటలో విశాలమైన, అందమైన రాజోద్యాన వనాలు, పుర ఉద్యానవనాలు ఉండేవి. అవి ఇంద్రలోకంలోని నందనవనాన్ని గుర్తు చేసే విధంగా ఉండేవి. సాయంకాల సమయములో కవులు, పండితులు ఆ పురోద్యానవనాలలో గుంపులు గుంపులుగా కూర్చుండి సారస్వత చర్చలు, కవితా గోష్ఠులు చేసేవారు. నగీనాబాఘ్ అనే ఉద్యానవనం చారిత్రక ప్రసిద్ధి కలిగినది.
కోటలో ఉన్న భవనాలు : కోటలో అంతఃపురాలు, సభాభవనాలు, కార్యాలయాలు, జలాశయాలు, క్రీడామైదానాలు మాత్రమే గాక సైనిక సమూహాలు నివసించే ఇండ్లు, అధికారుల నివాసస్థానాలు, పారిశ్రామికుల ఇండ్లు, పండిత, పామర నాగరికుల ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకు మరుగుదొడ్లు, మురుగు నీరుపారే వసతులు, స్నానపు గదులు, వాటికి వేడి, చల్లనీటి ఏర్పాట్లు మొదలైన సామాజిక ఆరోగ్యానికి అవసరమైన ఇతర వసతులు కల్పించబడ్డాయి.
‘చాలాసేపు నీవు టి.వి. చూడవద్దు’ – ఇది ఏ రకమైన వాక్యం? A) నిషేధార్ధక వాక్యం B) విధ్యర్థక వాక్యం C) ప్రశ్నార్థక వాక్యం D) ఆత్మార్థకం
A) నిషేధార్ధక వాక్యం
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి వినిమయ బిల్లు, ప్రామిసరీ నోట్ల మధ్య వ్యత్యాసములు తెలపండి.
వినిమయ బిల్లుకు, ప్రామిసరీ నోటుకు క్రింది తేడాలున్నవి. వినిమయ బిల్లు 1. బిల్లును ఋణదాత తయారుచేస్తాడు. 2. బిల్లులో బేషరతులతో కూడిన ఉత్తర్వు ఉంటుంది. 3. బిల్లులో బిల్లుకర్త, బిల్లు స్వీకర్త, బిల్లు గ్రహీత అనే మూడు పార్టీలుంటాయి. 4. బిల్లుకు బిల్లు స్వీకర్త స్వీకృతి అవసరం. 5. బిల్లు కర్త మరియు బిల్లు గ్రహీత ఒకరే కావచ్చు. 6. బిల్లు అనాదరణ జరిగితే ధృవీకరణ, ఆక్షేప సూచన తప్పనిసరి. ప్రామిసరీ నోటు 1. ప్రామిసరీ నోటును ఋణగ్రస్తుడు తయారుచేస్తాడు. 2. నోటులో బేషరతుతో కూడిన వాగ్దానము ఉంటుంది. 3. నోటులో నోటుకర్త (ఋణగ్రస్తుడు) గ్రహీత (ఋణదాత) అనే రెండు పార్టీలు ఉంటాయి. 4. నోటుకు స్వీకృతి అవసరము లేదు. 5. నోటు రాసిన వ్యక్తి గ్రహీత అయ్యే అవకాశము ఉండదు. 6. నోటు అనాదరణ చెందితే ధృవీకరణ, ఆక్షేప సూచన అవసరం లేదు.
అంకణా తయారుచేసే పద్ధతులను వివరించండి.
అంకణాను రెండు పద్ధతులలో తయారుచేస్తారు. 1. మొత్తాల పద్ధతి 2. నిల్వల పద్ధతి. 1) మొత్తాల పద్ధతి : ఆవర్జాలోని ప్రతి ఖాతా డెబిట్, క్రెడిట్ వరుసలు విడివిడిగా కూడి అంకణాను తయారుచేసే పద్ధతిని మొత్తాల పద్ధతి అంటారు. ఈ పద్ధతి ప్రకారము ఆవర్జా ఖాతాలోని డెబిట్ మొత్తాన్ని, క్రెడిట్ మొత్తాన్ని కూడాలి. అయితే ఈ పద్ధతి ప్రస్తుతము వాడుకలో లేదు. 2) నిల్వల పద్ధతి : ఇది బాగా వాడుకలో ఉన్న పద్ధతి. ఈ పద్ధతిలో ప్రతి ఆవర్జాలోని ఖాతా నిల్వను తీసుకుంటారు. అంకణాలో డెబిట్ నిల్వను డెబిట్వైపు, క్రెడిట్ నిల్వను క్రెడిట్వైపు చూపుతారు. ఈ రెండు వరుసల మొత్తాలు సమానముగా ఉంటే, అంకగణిత దోషాలు లేవని చెప్పవచ్చును.
‘శాంతి’ ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక కరపత్రం రాయండి.
ప్రపంచశాంతి మిత్రులారా ! ఈ విషయాన్ని గూర్చి ఒక్కసారి ఆలోచించండి. చిన్న చిన్న విషయాలకోసం దెబ్బలాటలకు దిగి, తలలు బద్దలుకొట్టుకోకండి. న్యాయస్థానాలకు వెళ్ళి డబ్బు తగులబెట్టకండి. మనది గాంధీ, బుద్ధుడు, జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన దేశం. ఎందరో మహర్షులు, ప్రవక్తలు పుట్టిన దేశం. వారి శాంతి బోధలు తలకు ఎక్కించుకోండి. ప్రపంచంలో ఇప్పటికే రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయి. ఇంకా ఎన్నో చిన్న చిన్న తగవులు జరిగాయి. యుద్ధాలవల్ల ఎంతో ధనవ్యయం, ప్రాణనష్టం జరుగుతుంది. యుద్ధాల్లో పాల్గొన్న దేశాలు, అభివృద్ధి లేకుండా వెనుకబడతాయి. కాబట్టి యుద్ధాలు వద్దు. శాంతి మనకు ముద్దు. ప్రపంచ పౌరులంతా సోదరుల వలె మెలగుదాం. స్నేహం, ప్రేమ, కరుణ, వాత్సల్యం మనకు మంచిదారిని చూపిస్తాయి. శాంతి మంత్రాన్ని అంతా జపిద్దాం. సరేనా? ఇట్లు ప్రపంచ బాలబాలికల సంఘం.
క్రింది వానిలో పరిమిత సమితి. A) {x : x ∈ N మరియు (x – 1) (x – 2) = 0} B) {x: n ∈ N మరియు x = 2n + 1} C) {x : x ∈ Z మరియు x^2 ≥ 24} D) {x : x ∈ Z మరియు x <4}
A) {x : x ∈ N మరియు (x – 1) (x – 2) = 0}
ఏకస్వామ్య పోటీ గురించి సంక్లిప్తంగా వివరించండి
ఈ మార్కెట్లో వస్తు వైవిధ్యం ఉంటుంది. అనగా అనేక సంస్థలు కొంత భేదంతో ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. అవన్నీ సన్నిహిత ప్రత్యామ్నాయాలు. ఉదా: బూస్ట్, బోర్నవిటా మొదలగునవి.
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి ‘రూపాంతరం’ను నిర్వచించండి. మర్రి వృక్షం, మాంగ్రూప్ మొక్కలలో వేరు ఏ విధంగా రూపాంతరం చెందిందో తెలపండి.
1. రూపాంతరం: కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించడానికిగాను మొక్కల అంగాలలో ఏర్పడే నిర్మాణాత్మకమైన శాశ్వత మార్పుని రూపాంతరం అంటారు. 2. మర్రి వృక్షంలో వేర్లు పెద్దశాఖల నుండి ఊడవేర్లుగా రూపాంతరం చెందుతాయి. ఇవి నేలలోనికి పెరిగి స్థంభాలవలె పెరిగి వృక్షానికి అదనపు ఆధారాన్ని ఇస్తాయి. 3. మాంగ్రూవ్ మొక్కలలో వేర్లు శ్వాసమూలాలుగా రూపాంతరం చెందాయి. ఇవి బురదనుండి భూమిపైకి నిటారుగా పెరుగుతాయి.
కింది పదాలను విడదీసి రాయండి. ఉదా : అప్పుడప్పుడు = అప్పుడు + అప్పుడు 1. అక్కడక్కడ 2. ఏమేమి 3. చిట్టచివర 4. నట్టనడుమ 5. పట్టపగలు
1. అక్కడక్కడ = అక్కడ + అక్కడ 2. ఏమేమి = ఏమి + ఏమి 3. చిట్టచివర = చివర + చివర 4. నట్టనడుమ = నడుమ + నడుమ 5. పట్టపగలు = పగలు + పగలు
రంగాపురం గ్రామంలో రాధ 10వ తరగతి చదువుతున్నది. ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఆ గ్రామంలోని ‘బాలల హక్కుల వేదిక’ సభ్యులు వెళ్ళి బాల్యవివాహం జరపడం వల్ల నష్టాలను ‘రాధ’ తల్లిదండ్రులకు వివరించారు. బాల్య వివాహాన్ని ఆపారు. రాధ తన చదువును తిరిగి కొనసాగించింది. రాధ వివాహం ఆపిన ‘బాలల హక్కుల వేదిక’ను అభినందిస్తూ ఒక లేఖ రాయండి.
లేఖ అనంతపురం, x x x x x x x x ‘బాలల హక్కుల వేదిక’ వారికి, రామాపురం, బంటుమిల్లి మండలం, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్. మిత్రులారా, మీరు సాధించిన ఘనవిజయాన్ని గూర్చి పత్రికలో చదివాము. మీ వేదిక సభ్యులు ‘రాధ’ అనే 10వ తరగతి చదివే 15 సంవత్సరాల అమ్మాయికి నిశ్చయమైన బాల్యవివాహాన్ని ఆపుచేయించారని తెలిసింది. బాల్యవివాహం వల్ల రాధ జీవితంలో ఎదుర్కోవలసిన కష్టాలను, ఆమె తల్లిదండ్రులకు వివరించి చెప్పి ఆ పెళ్ళిని జరగకుండా మీరు ఆపు చేయించారని తెలిసి మేము ఎంతో ఆనందించాము. మీరు చాలా మంచిపని చేశారు. రాధకు తిరిగి చదువుకొనే అవకాశం కల్పించి, ఆమె జీవితంలో వెలుగు రేఖలు ప్రసరించేలా చేశారు. మీకు మా ప్రత్యేక అభినందనలు. ధన్యవాదములు. మీ వేదిక సభ్యులందరికీ మా కృతజ్ఞతలు. ఇట్లు, స్నేహ బాల సంఘం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్. చిరునామా: బాలల హక్కుల వేదిక, రామాపురం, బంటుమిల్లి మండలం, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.
తెలుగు వ్యావహారిక భాషలో తరచు వాడే కింద ఇచ్చిన జాతీయం గురించి వివరించండి: ఉలుకు పలుకూ లేకపోవడం
‘ఉలుకు’ అంటే భయం ‘పలుకు’ అంటే మాట ఎవరైనా ఎక్కడైనా భయంకరమైన జంతువును చూచినప్పుడుగాని, భయంకరాకృతిని చూచిన సందర్భంలోను నిశ్చేష్ఠులై పడి ఉండటాన్ని ఈ పదం తెలియజేస్తుంది. నిష్క్రియత్వం లేకపోవడమే ఉలుకు పలుకూ లేకపోవడం.
కింది పేరాలోని సామెతలను గుర్తించి రాయండి. “అప్పుచేసి పప్పుకూడు తినకుండా, కోటి విద్యలు కూటి కొరకే కాబట్టి, ఏదో ఒక విద్యను నేర్చుకొని, తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం మాని, మూడు పువ్వులు ఆరు కాయలుగా జీవితంలో వృద్ధి చెందాలి”.
పై పేరాలోని సామెతలు ఇవి : 1) అప్పుచేసి పప్పుకూడు 2) కోటి విద్యలు కూటి కొరకే 3) తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం 4) మూడు పువ్వులు ఆరుకాయలు
ఇచ్చిన పదానికి నానార్ధాలు ఇవ్వండి: సూత్రం
నూలుపోగు, జంధ్యం, ఏర్పాటు
ప్రశ్న : సముద్రగుప్తుడు గొప్ప విజేత అని నీవు భావిస్తున్నావా? సమాధానాన్ని సమర్ధింపుము.
సముద్రగుప్తుడు గొప్ప విజేత అని నేను భావిస్తున్నాను. మొదటి చంద్ర గుప్తుని తర్వాత సముద్రగుప్తుడు రాజైనాడు. ఇతని కాలంలో సామ్రాజ్యము ఉత్తర భారతదేశం అంతటా విస్తరించినది. సముద్రగుప్తుడు అపజయమే ఎరుగనటువంటి గొప్ప విజేత. ఇతని తర్వాత రెండవ చంద్రగుప్తుడు పరిపాలకుడయ్యాడు. పశ్చిమ భారతదేశంలోని శకరాజులను కూడా ఇతను జయించగలిగినాడు. సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలోని తొమ్మిది మంది ప్రముఖ రాజులను ఓడించి వారి రాజ్యాలను తమ రాజ్యంలో కలుపుకున్నాడు. దక్షిణాదిన 12 మంది రాజులను ఓడించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. తమిళనాడులోని కంచి వరకు తన జైత్రయాత్రను కొనసాగించాడు.
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మీ పరిసరాలలో ఉన్న ఒకే రకమైన ఆహారపు అలవాట్లు గల జంతువులను పేర్కొనండి.
ఆవు, గేదె, మేక మరియు గొర్రెలు ఒకే రకమైన ఆహారపు అలవాటును కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇవి శాకాహారులు. ఆహారం కోసం మొక్కల పై ఆధారపడతాయి.
కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి. రాముడు అడవికి వెళ్ళెను. రాముడు తండ్రి మాట నెరవేర్చెను.
రాముడు అడవికి వెళ్ళి, తండ్రి మాట నెరవేర్చెను.
ఆంజనేయ స్తొత్రం రాయండి
నమో వాయుపుత్రాయ భీమరూపాయధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయశ్రీమతే మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ వనౌకసాం వరిష్ఠాయ వశినే వననాసినే తత్త్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ జన్మమృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ నేదిష్ఠాయ మహాభూతప్రేత భీత్యాది హారిణే యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే యక్షరాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహ్నతే మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధృతే హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే లాభ దోసిత్వేమేవాసు హనుమాన్ రాక్షసాంతక యశోజయంచ మే దేహి శత్రూన్ నాశయ నాశయ స్వాశ్రితానామ భయదం య ఏవం స్తౌతి మారుతిం హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్. ఈ ఆంజనేయస్తోత్రం నిత్యం పఠించదగినది.
క్రింది ప్రశ్నకి ఒక్కమాటలో జవాబునివ్వండి. హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా ఉన్న లోయ ఏది?
బ్రహ్మపుత్ర లోయ.
ఇచ్చిన పద్యానికి భావం రాయండి: మ|| నునుపుల్ దీర్చి మదంబు చిందిపడ నేన్గున్ గున్నలన్ జెక్కి వై చిన చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చెన్సత్కిరీటాకృతిన్; తెనుగుందేశము నిన్నువంటి పనివానిం జూచి యుప్పొంగుచుం డును; నీ లేమి దలంచి కంటఁ దడిబెట్టున్; శిల్పవిద్యానిధీ !
భావం : శిల్ప విద్యలో నిధివంటివాడా ! రాతిని నునుపు చేసి మదం చిందేటట్లుగా ఏనుగునూ, దాని పిల్లలనూ చెక్కిన నీ నేర్పు, నీ తలపై మంచి కిరీటం వలె నిలిచింది. తెలుగునేల నీ వంటి పనివాళ్ళను చూసి ఉప్పొంగిపోతూ ఉంటుంది. నీ దారిద్య్రాన్ని చూచి కన్నీరు కారుస్తుంది.
ప్రస్తుత శాస్త్ర విజ్ఞానం ప్రకారం కడుపులో అల్సర్ లకు కారణం ………….. గా కనుగొన్నారు. ఎ) వ్యాకులత బి) ఆహారపు అలవాట్లు సి) బాక్టీరియా డి) నులి పురుగులు
సి) బాక్టీరియా
కంపెనీ స్థాపనా విధానాన్ని కూలంకషంగా విపులీకరించండి.
కంపెనీ స్థాపనలో నాలుగు దశలుంటాయి. అవి. 1) వ్యవస్థాపన 2) నమోదు లేదా రిజిస్ట్రేషన్ 3) మూలధన సమీకరణ 4) వ్యాపార ప్రారంభము. 1) వ్యవస్థాపన : కంపెనీ ఏర్పాటుకు ముందు జరిగే కార్యక్రమాన్ని వ్యవస్థాపన అంటారు. అనగా వ్యాపార ఉద్దేశ్యాన్ని ఏర్పరచుకొని, అవకాశాలను కనుగొని లాభార్జన కోసము ఉత్పత్తి సాధనాలను సమీకరించుకొని సమర్ధవంతముగా నిర్వహించే ప్రక్రియను వ్యవస్థాపన అంటారు. వ్యవస్థాపనలో నాలుగు దశలుంటాయి. 1. వ్యాపార అవకాశాలను కనుగొనుట 2. సమగ్రమైన పరిశోధన, 3. వనరుల సమీకరణ, 4. ఆర్థిక ప్రతిపాదన. 2) కంపెనీ నమోదు లేదా రిజిస్ట్రేషన్ : ఏ కంపెనీ అయినా చట్టబద్ధముగా గుర్తింపు పొందవలెనంటే నమోదు అవసరము. నమోదు కొరకు కొన్ని ముఖ్యమైన పత్రాలను రిజిస్ట్రారు వద్ద దాఖలుచేసి రిజిస్ట్రేషన్ చేయాలి. కంపెనీ, నమోదుకొరకు దాఖలు చేయవలసిన ముఖ్య పత్రాలు. పేరు అనుమతి కోసము దరఖాస్తు సంస్థాపనా పత్రము నియమావళి క్రింది అదనపు పత్రాలను కూడా రిజిస్ట్రారు వద్ద, దాఖలు చేయాలి. i) మొదటి డైరెక్టర్ల సమ్మతి పత్రము ii) పవర్ ఆఫ్ అటార్నీ iii) కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయం తెలిపే నోటీసు iv) డైరెక్టర్లు, మేనేజరు, సెక్రటరీ వివరాలు 5. శాసనాత్మక ప్రకటన నమోదు రుసుం చెల్లింపు నమోదు పత్రము పై పత్రాలను రిజిస్ట్రారు పరిశీలించి సంతృప్తి చెందిన మీద కంపెనీ నమోదు పత్రాన్ని జారీ చేస్తాడు. నమోదు పత్రము పొందిన వెంటనే ప్రైవేటు కంపెనీ వ్యాపారమును ప్రారంభించవచ్చును. కాని పబ్లిక్ కంపెనీ వ్యాపారమును ప్రారంభించుటకు వ్యాపార ప్రారంభ ధ్రువ పత్రాన్ని పొందవలెను. 3) మూలధన సేకరణ : కంపెనీ వాటాలను జారీచేసి మూలధనాన్ని సేకరిస్తుంది. కంపెనీ నమోదుకు ప్రాథమిక ఖర్చులు, ఆస్తుల కొనుగోలు మొదలైన వాటికి అవసరమయ్యే మొత్తాన్ని కనీసపు చందా అంటారు. కంపెనీ పరిచయ పత్రములో పేర్కొన్న కనీసపు చందా మొత్తాన్ని సేకరించకుండా వ్యాపారమును ప్రారంభించలేదు. కంపెనీ జారీ చేసిన మూలధనములో మొత్తాన్ని, 90% పరిచయ పత్రాన్ని జారీ చేసిన 120 రోజులలోపు సేకరించాలి. అలా సేకరించకపోతే సెబీ సూచనల మేరకు 10 రోజులలోపు దరఖాస్తు దారులకు తిరిగి చెల్లించవలెను. 4) వ్యాపార ప్రారంభము పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధ్రువపత్రాన్ని పొందుటకు ఈ క్రింది పత్రాలను రిజిస్ట్రారుకు సమర్పించాలి. పరిచయ పత్రము లేదా ప్రత్యామ్నాయ పరిచయ పత్రము.. డైరెక్టర్ల అర్హత వాటాలు తీసుకొని చెల్లించినట్లు ధృవీకరణ పత్రము. కనీసపు చందా వసూలైనట్లు, దాని మేరకు వాటాలను కేటాయించినట్లుగా ధృవీకరణ పత్రము. వ్యాపార ప్రారంభానికి అవసరమైన లాంఛనాలు పాటించినట్లుగా కంపెనీ డైరెక్టరు లేదా సెక్రటరీ ప్రకటన. పై పత్రాలను రిజిస్ట్రారు పరిశీలించి, సంతృప్తి చెందినట్లయితే వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని జారీ చేస్తాడు. ఈ పత్రము పొందడముతో కంపెనీ స్థాపన పూర్తి అవుతుంది.
ప్రశ్న : వాళ్ళు పన్నులు చెల్లించటానికి ఎందుకు అంగీకరించి ఉంటారు? కొత్త ఏర్పాట్ల వల్ల వాళ్ళు ఏరకంగా ప్రయోజనం పొందారు?
తమ జీవితాల రక్షణ కోసం, నీటిపారుదల సౌకర్యాల కోసం, తెగ వృద్ధి కోసం పన్నులు చెల్లించడానికి అంగీకరించి ఉంటారు. కొత్త ఏర్పాట్ల వల్ల వాళ్ళు తమ దృష్టిని పూర్తిగా తమ వ్యవసాయంపైన, వ్యాపారం పైనా పెట్టి ఉంటారు. తద్వారా వారు మంచి ఆదాయం పొంది ఉంటారు.
బదిలీ చెల్లింపులు గురించి సంక్లిప్తంగా వివరించండి
కొందరు వ్యక్తులు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినా ఆదాయంలో కొంత భాగాన్ని చెల్లించవలసి ఉంటుంది. అవి పెన్షన్లు, నిరుద్యోగభృతి, ప్రభుత్వ బాండ్లపై వడ్డీ మొదలగునవి. వీటిని బదిలీ చెల్లింపులు అంటారు.
అంతర్గత విత్త మూలాధారాలు గురించి సంక్లిప్తంగా వివరించండి
అంతర్గత మూలాలు అంటే సంస్థలోనే లభ్యమయ్యే వనరులు. అవి: లాభాల పునరాకర్షణ నిలిపి ఉంచిన ఆర్జనలు వసూలు బిల్లులపై వసూళ్ళు మిగిలిన సరుకు అమ్మకాలు నిధులను వెనక్కి మళ్ళించడం లేదా నిధుల తగ్గింపు.
“కోపమంత చేదు ఫలము లేదు” వివరించండి ?
కోపంతో మానవులు మానవత్వాన్ని కోల్పోతారు. కోపం మానవులను నష్టపరుస్తుంది. కోపం వల్ల పాపం పెరుగుతుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను తగ్గిస్తుంది అవమానపరుస్తుంది. కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను నాశనం చేస్తుంది. కాబట్టి కోపానికి దూరం ఉండాలని భావం.
“అమ్మ ప్రేమ ఉత్తమమైనది”. దీనిని సమర్థిస్తూ చర్చించండి.
(చర్చలో లత, రవి, కిరణ్, రాణి పాల్గొంటున్నారు) లత : మా అమ్మ నాకెంతో ప్రేమగా చదువు చెబుతుంది. రవి : మా అమ్మ చదువూ చెబుతుంది, భక్తిని, సంస్కారాన్ని నేర్పుతుంది. కిరణ్ : మా అమ్మ కూడా అంతే, కాబట్టి మా అమ్మ ఒడి నాకు బడి, గుడి. రాణి : నేను మాట్లాడే మాటలన్నీ మా అమ్మ నేర్పినవే. లత : ఎంతో ప్రేమగా నాకు మంచి ఆలోచనలు మా అమ్మే నేర్పింది. రవి : మా అమ్మ చిరునవ్వుతో నా తెలివిని ప్రోత్సహిస్తుంది. కిరణ్ : మా అమ్మ చక్కగా మాట్లాడుతుంది. పాడుతుంది. రాణి : మా అమ్మ మనసంతా అనురాగమే. రవి : మన అల్లరిని చిరునవ్వుతో భరించే అమ్మ ప్రేమమూర్తి. లత, కిరణ్, రాణి : (ఒక్కసారి) అందుకే అమ్మ ప్రేమ ఉత్తమమైనది.
ఫెరిటిమాలోని శుక్రగ్రాహికలు అంటే ఏమిటి? అవి ఏ ఖండితాలలో ఉంటాయి?
ఫెరిటిమాలో 6, 7, 8, 9 ఖండితాలలో పూర్వ విభాజకమునకు అంటుకొని ఖండితానికి ఒక జత చొప్పున శుక్రగ్రాహికలు అనబడే నిర్మాణాలుంటాయి. ఇవి సంపర్క సమయంలో శుక్ర కణాలను (శుక్ర గుళికలు) గ్రహించి నిల్వ చేస్తాయి.
నీటిని విచక్షణాయుతంగా వాడవలసిన అవసరం ఏమిటి?
భూమిపై ఉన్న మొత్తం నీటిలో సముద్రాలు, మహాసముద్రాలు, భూగర్భ జలాలలో ఉన్న నీటిలో 97 శాతం ఉప్పు నీరే. 2.5-2.75% మాత్రమే మంచినీరు. దీనిలో 1.75-2% (మూడింట రెండు వంతులు) నీరు గ్లేషియర్లు, మంచు, హిమపాతం రూపంలో గడ్డకట్టి ఉంటుంది. 0.7-0.8% మంచినీరు భూగర్భజలంగా, నేలలో నీటి ఆవిరి రూపంలో ఉంటుంది. 0.01%’ కంటే తక్కువ పరిమాణంలో మంచినీరు ఉపరితల జలం రూపంలో సరస్సులు, నదులలో ఉంటుంది. మంచినీరు చాలా తక్కువ ఉన్నప్పటికీ విచక్షణతో ఉపయోగించాలి.
ద్రవ్యోల్బణాన్ని నిర్వచించి, కారణాలను వివరించండి.
సాధారణ ధరల స్థాయిలో స్థిరమైన, గ్రహించదగిన పెరుగుదల పరిస్థితిని ద్రవ్యోల్బణం అంటారు. ఇది అనేక విధాలుగా ప్రజల ఆర్థిక జీవితాన్ని, సంక్షేమాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఉత్పత్తి విలువ, పంపిణీ విలువ ప్రభావితం కలిగి ఉంటుంది. ద్రవ్యోల్బణానికి కారణాలు: ద్రవ్యోల్బణం అధిక డిమాండు వల్లగాని, అల్ప సప్లయ్ వల్లగాని, ఉత్పత్తి వ్యయం పెరుగుదల వల్లగాని ఏర్పడుతుంది. ఈ పరిస్థితులకు దారితీసే పలు అంశాలు. a) వస్తువుల సమిష్ఠి డిమాండ్ పెరుగుదల: అధిక జనాభా పెరుగుదల రేటు. ఆర్థికాభివృద్ధి వల్ల తలసరి ఆదాయాలు పెరగడం. ఉద్యోగిత కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం అధికంగా ఖర్చుచేయడం. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్ పెరగడం. ప్రత్యక్ష పన్నురేట్లు తగ్గించటం. లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరించడం. b) అల్ప సప్లయ్ కారణాలు: వ్యవసాయ రంగంలో ఋతుపవనాలు విఫలం కావడం, వరదలు, పంటలకు తెగులు రావడం, కల్తీ విత్తనాల వాడకం మొదలైనవి. సంస్థాగత పరపతి తగినంత లభించనందువల్ల పెట్టుబడి కొరత ఏర్పడటం. ఉత్పాదకాలు, ముడిపదార్థాల సప్లయి లేకపోవడం లేదా కొరతగా ఉండటం. విద్యుత్ కొరత, కార్మికుల అశాంతి మొదలైన కారణాల వల్ల స్థాపిత శక్తి పూర్తిగా వినియోగించుకోలేకపోవటం. కొన్ని పరిశ్రమల దీర్ఘ ఫలనకాలం. దేశంలో వినియోగానికి సప్లయ్ తగ్గించి ఎగుమతులు చేయడం. c) ఉత్పత్తి వ్యయం పెరుగుదలకు కారణాలు: ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం. పన్నుల రేట్లు పెరగడం. ఆధునిక పద్ధతులు ఉపయోగించకుండా పాత పద్ధతులలో ఉత్పత్తి చేయడం. అధిక ధరలకు యంత్రాలను, పనిముట్లను దిగుమతి చేయడం.
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి షాట్కీ లోపం అంటే ఏమిటి?
షాట్కీ లోపం : 1. “శుద్ధ జాలకంలో ఖాళీ ఉంటే దాన్ని షాట్కీ లోపం అంటారు. జాలకం సాధారణ స్థానం నుంచి ఒక పరమాణువు లేదా అయాన్ ను తీసివేస్తే వచ్చేది బిందులోపం.” 2. అయానిక స్ఫటికాలలో విద్యుత్ ఆవేశాల తటస్థ స్థితిని నిలబెట్టాలి. అందుకోసం ఒక కాటయాన్ అయాన్ వల్ల ఖాళీ ఏర్పడితే దానితోపాటు ఆ అయాన్కు విరుద్ధ ఆవేశంగల ఆనయాన్ అయాన్ కూడా తన స్థానం నుంచి పోతుంది. 3. ప్రధానంగా ఎక్కువ అయానిక స్వభావం ఉండి, కాటయాన్, ఆనయాన్ సైజులు ఒకేలాగా ఉండే సమ్మేళనాల్లో ఉంటుంది. అట్లాంటి సమ్మేళనాల్లో కో ఆర్డినేషన్ సంఖ్య అధికంగా ఉంటుంది. ఉదా : NaCl, CsCl 4. ఈ లోపం వలన స్ఫటికము యొక్క సాంద్రత తగ్గుతుంది.
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి ఏ విధంగా గాజు క్వార్ట్జ్ నుంచి విభిన్నంగా ఉంటుంది?
గాజు ఒక అస్ఫాటిక ఘన పదార్థం. ఇందులో కణాల అమరిక లఘు విస్తృతి క్రమంలో ఉంటుంది. క్వార్ట్జ్ ఒక స్ఫటిక ఘన పదార్థం. ఇందులో కణాల అమరిక దీర్ఘ విస్తృతి క్రమంలో ఉంటుంది.
సత్యవాక్కువలన కలిగే ప్రయోజనాలు ఏవి?
సత్యం మాట్లాడడం వలన కీర్తి పెరుగుతుంది. సత్యం మాట్లాడడం వలన జన్మ వలన వచ్చిన అజ్ఞానం నశిస్తుంది. సత్యం వలన మన స్వభావం స్థిరంగా ఉంటుంది. అందుచేత సత్యవాక్కుతో సమానమైన వ్రతం లేదు.
ఇచ్చిన పద్యానికి భావం రాయండి: చ. బలయుతుఁడైన వేళ నిజబంధుఁడు తోడ్పడుఁగాని యాతఁడే బలము తొలంగెనేని తన పాలిటి శత్రువదెట్లు పూర్ణుఁడై జ్వలనుఁదు కానఁగాల్చు తఱి సఖ్యముఁ జూవును వాయుదేవుఁదా బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా!
అగ్నిహోత్రుడు నిండు బలము కలవాడై అడవిని కాల్చే సమయంలో వాయుదేవుడు అతినికి స్నేహం చూపుచూ తోడ్పడును. ఆ అగ్నిచిన్నదీపమై ఉన్న సమయంలో ఆ వాయుదేవుడే విరోధియై ఆర్పును. అదే విధంగా మానవుడు శక్తివంతుడై ఉన్న సమయంలో తన బంధువులే తోడ్పడును. బలము లేనపుడు ఆ చుట్టమే తనకు పగవాడై కీడు చేయును.
‘స్త్రీ విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ మీ సొంతంగా ఐదు నినాదాలు రాయండి.
ఇల్లాలి చదువు – ఇంటికి వెలుగు స్త్రీవిద్యను ప్రోత్సహించు – ప్రగతిబాట పయనించు మహిళలు చదవాలి – స్వావలంబన సాధించాలి మహిళా చైతన్యం – సాధికారితకు సాకారం ఇల్లంతా చదివినట్లే – ఇల్లంతా చదివితే
ఆవృత బీజ పుష్పంలోని ఏయే భాగాలలో పురుష, స్త్రీ సంయోగ బీజదాలు అభివృద్ధి జరుగుతుంది? వాటి పేర్లను తెలపండి.
పురుష సంయోగ బీజదము – పరాగకోశంను, స్త్రీ సంయోగ బీజదము అండంలోను అభివృద్ధి చెందుతాయి. సూక్ష్మ సిద్ధబీజం పురుష సంయోగబీజంగాను, స్థూలసిద్ధబీజం స్త్రీ సంయోగబీజదంగాను మారుతాయి.
ఇచ్చిన సమాచారం పరిగణించి శాస్త్రవేత్తని కనిపెట్టండి రోగి హృదయ స్పందన వినడానికి మొదటిసారి కాగితపు గొట్టాన్ని ఉపయోగించాడు. కాగితపు గొట్టం స్థానంలో వెదురు గొట్టాన్ని వాడేవారు. దానికి స్టెతస్కోప్ అని పేరు పెట్టారు.
రెని లెన్నేక్
కింది గద్యాన్ని చదివి ఖాళీలను పూరించండి. మాటలను ఉచ్చరించునపుడు కొన్నింటిని తేల్చి పలుకుటయు, కొన్నింటిని ఒత్తి పలుకుటయు, కొన్నింటిని మధ్యస్థముగా పలుకుటయు అనుభవ సిద్ధమగు విషయమే. ఈ విధముగా ఆరోహణా వరోహణాది క్రమములో పలుకుటను ‘స్వరము’ అని యందురు. ఉచ్చారణ సమయమున కంఠము నందలి నాదతంత్రులు ప్రకంపించునట్టి వేగమును బట్టి ఈ స్వరము కలుగును. ఉచ్చారణ సమయమున నాదతంత్రులు సాగిన దూరమును బట్టి ఊనిక కలుగును. ఏదేని మాటను ఒత్తి చెప్పవలసి వచ్చినప్పుడు గట్టిగా బలముగా చెప్పుట స్వాభావికం. ఊనిక, స్వరము ఈ రెండింటి కారణముగా ఉచ్చారణమున పెక్కు మార్పులు కలుగవచ్చును. అవి క్రమముగా భాషలో స్థిరపడవచ్చును. ఖాళీలు 1. స్వరమంటే …………………… 2. ఉచ్చారణ సమయంలో ప్రకంపించేవి ……………………… 3. స్వరము కలగడానికి కారణం ………………….. 4. ఊనిక కలగడానికి కారణం ………………… 5. ఉచ్చారణలో మార్పులు కలగడానికి కారణం ………………….
ఖాళీలు 1. స్వరమంటే …………………… జవాబు: ఆరోహణ అవరోహణాది క్రమములో పలుకుట. 2. ఉచ్చారణ సమయంలో ప్రకంపించేవి ……………………… జవాబు: కంఠమునందలి నాదతంత్రులు. 3. స్వరము కలగడానికి కారణం ………………….. జవాబు: ప్రకంపన వేగము. 4. ఊనిక కలగడానికి కారణం ………………… జవాబు: నాదతంత్రులు సాగిన దూరం వలన. 5. ఉచ్చారణలో మార్పులు కలగడానికి కారణం …………………. జవాబు: నాదతంత్రుల ప్రకంపనలు, నాదతంత్రులు సాగిన దూరము.
డాక్టర్/నర్స్ / ఆరోగ్య కార్యకర్తలు అస్వస్థతతో ఉన్న రోగులతో ఎక్కువగా గడుపుతుంటారు. అయినా వారు అస్వస్థతకు ” గురికారు ఎందుకు ? ఆలోచించి రాయండి.
డాక్టర్ / నర్స్ / ఆరోగ్య కార్యకర్తలు అస్వస్థతతో ఉన్న రోగులతో ఎక్కువగా గడుపుతుంటారు. అయినా అస్వస్థతకు గురికారు. ఎందుకంటే వారు ఆరోగ్య నియమాలు చక్కగా పాటిస్తారు. దీనివలన వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి వికృతి నిర్వచించి, వికృతిలో రకాలను వివరించండి.
వికృతి : వస్తువు యొక్క మితులలో వచ్చిన మార్పుకు వస్తువు తొలి మితులకు గల నిష్పత్తినే వికృతి అంటారు. 1. అనుదైర్ఘ్య వికృతి : వస్తువుపై బాహ్యబలం పనిచేసినపుడు, పొడవులో మార్పునకు తొలిపొడవుకు గల నిష్పత్తిని అనుదైర్ఘ్య వికృతి అంటారు. 2. ఘనపరిమాణ వికృతి (లేదా) స్థూల వికృతి : వస్తువుపై బాహ్యబలం పనిచేసినపుడు ఘనపరిమాణంలో మార్పుకు, తొలి ఘనపరిమాణానికి గల నిష్పత్తిని ఘనపరిమాణ వికృతి లేదా స్థూల వికృతి అంటారు. 3. విమోటన వికృతి : వస్తువుపై సమాంతర బలం కలిగించడం వలన వస్తువు యొక్క స్థిర ఉపరితలానికి లంబంగా ఉన్న తలం తొలి మరియు తుది స్థానాల మధ్య కోణాన్ని విమోటన వికృతి అంటారు.
క్రింద ఇచ్చిన వ్యాసం దేని గురించి ప్రస్తావిస్తుంది: సనాతనమైన భారతీయ సంస్కృతిలో సాహిత్య సంపదకు సమాన్నతమైన స్థానం ఉంది. మన సంస్కృతిలో కావ్య సంపద ఉన్నతమైంది. మన తెలుగు సాహిత్యంలో ఎన్నో వర్ణనాత్మక కావ్యాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన పాఠ్యాంశాలు కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఉన్నాయి. వర్ణనాత్మక పాఠ్యాంశాలను చదవడం వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో కొన్ని. మన ఇతిహాసాలకు సంబంధించిన కళాత్మక రూపాలను, సుందర ప్రదేశాల విశిష్ఠతను తెలుసుకొనవచ్చు. వర్ణనల్లో ఉండే అందాలను, అనుభూతులను గ్రహించవచ్చు. మనం చూడలేని ప్రకృతి దృశ్యాల అందాలను విద్యార్థులు తెలుసుకోవచ్చు. వర్ణనల్లో ఉండే అలంకార మధురిమలను తెలుసుకోవచ్చు. శైలి భేదాలను, రసాత్మకతను గ్రహింపవచ్చు. ప్రాచీన కవుల అలంకారప్రయోగాలను, నుడికారాలను, యాసలను, సామెతలను తెలుసుకోవచ్చు. ఈ రకంగా ప్రాచీన వర్ణనాత్మక పాఠంను చదవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తరతరాల వారసత్వాన్ని తెలుసుకొని భావితరాలకు అందించవచ్చు.
ఇచ్చిన వ్యాసం ప్రాచీన వర్ణనాత్మక పాఠంను చదవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు గురించి ప్రస్తావిస్తుంది
ఇచ్చిన గద్యానికి కొనసాగింపుగా ఒక పేరా రాయండి: సురవరం ప్రతాపరెడ్డి సంపన్న కుటుంబీకులు. బి.ఏ. బి.ఎల్ పట్టభద్రులు. న్యాయవాద వృత్తి చేపట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి, ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయక, జీవితాంతం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన త్యాగమూర్తి సురవరం. ఈయన బహుభాషావేత్త, అనేక గ్రంథాలు రాశారు. ఉత్తమశ్రేణి పరిశోధకులు, నిర్భయంగా పత్రికను నడిపిన సంపాదకులు. ఆయన గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణా ప్రజలను అన్ని రంగాలలో మేలుకొల్పినారు. గోలకొండలో వీరు వ్రాసిన సంపాదకీయాలు అనేక విషయాలకు సంబంధించిన విజ్ఞాన నిక్షేపాలవంటివి.
రామాయణ రహస్యాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదలైన గొప్ప పరిశోధనాత్మకమైన గ్రంథాలను రాశారు. వారు కవులు, కథకులు, విమర్శకులు, వ్యాసకర్తలు, బహుముఖ ప్రతిభాసంపన్నులు. వారు రాసిన నిరీక్షణము వంటి కథలు కథానికా వాఙ్మయంలో మొదటి శ్రేణికి చెందిన కథలు.
రక్తంలోని వ్యర్థ పదార్థాలను ఏ విధంగా గుర్తిస్తారు?
మూత్ర పరీక్ష ద్వారా
తెలుగు భాషలో మీకు తెలిసిన కవుల పేర్లు రాయండి.
నన్నయభట్టు తెలుగులో ఆదికవి. తిక్కన, ఎఱ్ఱ ప్రగడ, శ్రీనాథుడు, పోతన, అనంతామాత్యుడు, బాలగంగాధర్ తిలక్, గురజాడ, రాయప్రోలు సుబ్బారావు, శ్రీశ్రీ, దాశరథి, జాషువ – నారాయణరెడ్డి వంటి తెలుగుకవుల పేర్లు నాకు తెలుసు.
యమకాలంకారం గురించి వివరించి ఉదాహరణలు ఇవ్వండి.
యమకాలంకారం : లక్షణం : అచ్చులలో హల్లులో మార్పులేనట్టి అక్షరాల సమూహం అర్థభేదంతో మరల మరల ప్రయోగింపబడితే దాన్ని ‘యమకాలంకారం’ అని అంటారు. ఉదాహరణ 1 : పురము నందు నందిపురమునందు. సమన్వయం : పై ఉదాహరణ వాక్యంలో ‘పురము’ అనే అక్షర సమూహం అర్థభేదంతో మరల మరల ప్రయోగింపబడింది. అందువల్ల దీనిని ‘యమకాలంకారం’ అని అంటారు. ఉదాహరణ 2 : లేమా ! దనుజుల గెలువఁగలేమా (లేమ = స్త్రీ; గెలువగలేమా = గెలువడానికి మేమిక్కడ లేమా (ఉన్నాం కదా !) ఉదాహరణ 3 : ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. (తోరణం = ద్వారానికి కట్టే అలంకారం; రణం = యుద్ధం) పై రెండు సందర్భాలల్లోను ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించడం జరిగింది. దీనినే ‘యమకాలంకారం’ అంటారు.
C = {1, 2, 3, 5} అయిన n (C) విలువ ఎంత ?
n(C) = 4
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి కేంద్రక రియాక్టర్ నియంత్రణ కడ్డీల పాత్ర ఏమిటి?
నియంత్రణ కడ్డీలు : కేంద్రక రియాక్టర్లో న్యూట్రాన్లను శోషించడానికి వాడే కడ్డీలను నియంత్రణ కడ్డీలు అంటారు. నియంత్రణ కడ్డీలకు వాడే పదార్థాలు కాడ్మియం, బెరీలియం, బోరాన్. రియాక్టర్ నియంత్రణ కడ్డీలను బయటకు లాగితే, పనిచేస్తుంది. లోపలికి నెట్టితే, రియాక్టర్ ఆగిపోతుంది.
పాఠశాలలకు విద్యార్థుల్ని పరీక్షచేయుటకు ‘పిల్లల డాక్టరు’ వచ్చారు. వారిని ఎలా ఇంటర్వ్యూ చేస్తారో వివరించండి.
నమస్కారం డాక్టరు గారూ ! నాతోటి బాలబాలికల్ని ఎప్పుడెప్పుడు వచ్చి పరీక్షిస్తారు ? సర్వ సాధారణంగా విద్యార్థుల్లో వచ్చే వ్యాధులేమిటి ? వాటికి నివారణోపాయాలేమిటి ? కొన్ని కొన్ని సందర్భాల్లో విద్యార్థుల్లో ‘డిస్లెక్సియా’ వ్యాధి వస్తూంటుంది అని నేను విన్నాను. దాని లక్షణాలేంటి ? ఆ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలి ? పేద విద్యార్థులకు మందులు కొనే పరిస్థితి లేదు. వారికి మందులిప్పించే ఏర్పాటు చేయగలరా ? మేం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే తగిన సలహాల్ని ఇవ్వవలసినదిగా కోరుచున్నాను.
ఇచ్చిన సమాచారం పరిగణించి శాస్త్రవేత్తని కనిపెట్టండి ఇతనొక బ్రిటీష్ వైద్యుడు. గుండెలో ఒకే దిశలో రక్త ప్రసరణకు తోడ్పడే కవాటాలను గుర్తించాడు. ఇవి రక్తాన్ని కర్ణికల నుండి జఠరికలకు ప్రవహింపజేస్తాయి అని కనుగొన్నాడు.
విలియం హార్వే
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధాలు మరియు తాత్పర్యం రాయండి: చ. విమలయశోనిధీ ! పురుషవృత్త మెఱుంగుచునుండుఁ జూవె వే దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు సంతరాత్మయున్ యముఁడును జంద్రసూర్యులు సహంబును రాత్రియు నన్మహాపదా ప్రములివి యుండంగా నరుఁడు దక్కొన నేర్చునే తన్ను మ్రుచ్చిలన్.
ప్రతిపదార్థం : విమల యశోనిధీ ! = నిర్మలమైన కీర్తికి నెలవైన ఓ రాజా ! వేదములను = ఋక్, యజుర్, అధర్వణ, సామ – అనే నాలుగు వేదాలూ పంచభూతములు = నేల, నింగి, నీరు, నిప్పు, గాలి – అనే అయిదు భూతాలూ ధర్మువు = ‘ధర్మమూ సంధ్యలు = ఉదయసంధ్య, సాయంసంధ్య అనే రెండు సంధ్యలూ అంతః + ఆత్మయున్ = మనస్సూ యముఁడును = మృత్యుదేవత అయిన యముడూ చంద్రసూర్యులు = చంద్రుడూ, సూర్యుడూ అహంబును రాత్రియున్ = పగలూ, రాత్రీ అన్ = అనే మహత్ + పదార్థములు = మహా పదార్థాలు పురుషవృత్తము = మనిషి చేసే పనులను ఎఱుంగుచున్ + ఉండున్ + చూవె = నిత్యం గమనిస్తూనే ఉంటాయి సుషూ ! ఇవి = ఈ మహాపదార్థాలు ఉండఁగాన్ = ఉండగా నరుఁడు = మానవుడు తన్ను = తనను తాను మ్రుచ్చిలన్ = వంచింపగా తక్కొనన్; నేర్చునే – పూనుకోగలడా ? (పూనుకోలేడని భావం) తాత్పర్యం : నిర్మలమైన కీర్తికి నెలవైన ఓ రాజా ! ఋక్, యజుర్, సామ, అధర్వణ అనే నాలుగు వేదాలూ, నేల, నింగి, నీరు, నిప్పు, గాలి – అనే అయిదు భూతాలూ (ప్రకృతులూ), ధర్మమూ, ఉదయం, సాయంత్రం – అనే రెండు సంధ్యలూ, మనస్సూ, మృత్యుదేవత అయిన యముడూ, చంద్రుడూ, సూర్యుడూ, పగలూ, రాత్రీ అనే మహా పదార్థాలు మనిషి నడవడికను నిత్యం గమనిస్తూనే ఉంటాయి సుమా ! ఈ మహా పదార్థాలు ఉండగా మనిషి తనను తాను వంచించుకోవటానికి సిద్ధపడగలడా ? (లేడని భావం).
ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుంది. సమర్థించుము.
ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుందనుటలో సందేహం లేదు. సాధారణంగా బహుళజాతి సంస్థలే వివిధ దేశాలలో ఉత్పత్తి, వాణిజ్యం చేస్తున్నాయి. వివిధ దేశాల మార్కెట్ ను కైవసం చేసుకోవటానికి MNC లు కచ్చితంగా పోటీపడతాయి. MNC లు భారీ పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తాయి. ఈ స్థాయిలో స్వదేశీ సంస్థలు తట్టుకోవాలంటే కొంచెం కష్టం. ఈ పోటీ వలన, భారీతరహా ఉత్పత్తి వలన, ఉత్పత్తి వ్యయం తగ్గించి వస్తువు ధర కూడా తగ్గుతుంది. ఉత్పత్తికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమును వినియోగించుకుని ఉత్పత్తిని పెంచుతారు. స్వేచ్చా మార్కెట్ కారణంగా వివిధ కంపెనీలు ఉండుట వలన వినియోగదారునికి ఎంపిక అవకాశం ఉంటుంది. దీని వలన కంపెనీల మధ్య పోటీ ఏర్పడుతుంది. కొత్త వాణిజ్య అవకాశాలు పెరగటం (ఉదా : e-కామర్స్) వలన కూడా పోటీ వాతావరణం నెలకొంది. మారుతున్న ఫ్యాషన్లకనుగుణంగా అనేక రకాల కొత్త మోడల్స్ (కార్లు, ఫోన్లు మొదలైనవి) రావటం వలన అవి స్వదేశీ మార్కెట్ కు తీసుకురావటంలో కూడా పోటీ ఏర్పడుతుంది.
ఈ క్రింది వానిలో సత్యమేది ? (A) ఒక బహుపది యందు స్థిర విలువ లేకుంటే దానికి – సున్న ఒక శూన్య విలువ (B) శూన్య విలువ వద్ద బహుపది విలువ సున్న (C) ఒక బహుపది (p, 0) వద్ద X – అక్షాన్ని ఖండించిన దాని శూన్య విలువ ‘p’ (D) పైవన్నీ
(D) పైవన్నీ
పూర్వకాలంలో వేడుకలు, వినోదాలను గురించి రాయండి.
తెలుగు దేశాన పూర్వకాలంలో వేడుకలు వినోదాలు ఎలా ఉండేవో, పండుగలు పబ్బాలతో ఎలా కాలక్షేపం చేసేవారో తెలుసుకొనుటకు ఆధారాలు అంతగా దొరకవు. కాకపోతే మన ప్రబంధముల ద్వారా కొన్ని తెలుస్తున్నాయి. వాటిలో వసంతోత్సవం, శరదుత్సవం గొప్పవేడుకలుగా వివరింపబడ్డాయి. వసంతోత్సవం వేయి సంవత్సరము లకు పూర్వం నుండి ఉన్నప్పటికి రెడ్డి రాజుల కాలq నుండి మంచి ప్రాచుర్యం వచ్చింది. ఇక వసంతోత్సవం తరువాత చెప్పదగిన వేడుక శరదుత్సవం. దీనిని మహా లక్ష్మీపండుగలని, దేవీ నవరాత్రులని పిలిచేవారు. మన పండుగలు, వేడుకలు మత సంబంధమైనవే ! గ్రామాలలోని దేవుని కళ్యాణం, గ్రామదేవతల జాతరలు దీనికి ఉదాహరణలు. మనకున్న పండుగలలో వసంతోత్సవం శరదుత్సవాలతోపాటుగా మకర సంక్రమణం (సంక్రాంతి) పండుగ కూడా ఒకటి. దీనిని ‘పెద్ద పండుగ’ అని పేరు. సంక్రాంతి పండుగ దినాలలో జరుపుకొనే వేడుకలలో కోడిపందెములు ఒకటి. కోడిపందాలు వేయి సంవత్సరములకు పూర్వం నుండి ఉన్నట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. పూర్వపు సంస్థానాధీశులకు కోడిపందాలు ఒక వేడుకగా ఉండేవి. పల్నాటి యుద్ధమునకు కారణం ఈ కోడి పందాలేనని చరిత్ర వలన తెలుస్తుంది. పూర్వ గ్రంథాలైన క్రీడాభిరామం, భోజరాజీయం మొదలగు గ్రంథాల వలన తెలుగు నేలపై వృషభపోరు, మేషయుద్ధము, దున్నపోతుల పోరు, గజయుద్ధము, పొట్టేళ్ళ పోరు మొదలగు ప్రజావినోదపు వేడుకలున్నట్లు తెలుస్తుంది. కుంతల దేశరాజైన సోమేశ్వర భూపతి తాను రచించిన ‘అభిలషితార్థ చింతామణి’ అను మారు పేరుతో ఉన్న ‘మానసోల్లాసం’ అనే విజ్ఞానకోశంలో ఈ వినోదవర్ణలకు ఒక ప్రకరణాన్నే వ్రాశాడు. దానిలో మల్లయుద్ధము, గజయుద్ధము, అశ్వయుద్ధాలు, ఆబోతుల దున్నపోతుల పోరాటములు, పొట్టేళ్ళ, కోళ్ళ పోరాటాలను వర్ణించాడు. పూర్వకాలంలో ‘వేట’ కూడా ఒక క్రీడవేడుక వలె ఉండేది. దీనిలో పాదివేట, విడివేట, తెరవేట, దా మెనవేట అని పలు రకములు ఉండేవి. పూర్వకాలమున ఈ వేడుకలు వినోదములు నేడు చాలా వరకు అంతరించిపోయాయి.
p) 1, 1/2,1/4,1/8 ……………. q) 1, 2, 4, 8, …….. అయితే A) p-గుణ శ్రేణి, q-అంకశ్రేణి B) p, q లు రెండూ అంకశ్రేఢులు C) p, q లు రెండూ గుణ శ్రేఢులు D) p-అంకశ్రేణి, q-గుణ శ్రేడి C
C) p, q లు రెండూ గుణ శ్రేఢులు